మార్చి 31న షావోమి ఎంఐ 10 స్మార్ట్ఫోన్
108 ఎంపీ భారీ కెమెరా
న్యూఢిల్లీ: షావోమి కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనుంది. ఇండియాలో తన మొట్టమొదటి 5 జీ ఎంఐ 10 స్మార్ట్ ఫోన్ను మార్చి 31న మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు షావోమి ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ ప్రకటించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఏప్రిల్ 7వ తేదీ రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు కస్టమర్లు ప్రీ ఆర్డర్లు చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ అమెజాన్ ఆన్లైన్లో సేల్ ప్రారంభం.
12 జీబీ ర్యామ్, 512 స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ ఆప్షన్లతో రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్ ఫోన్ లభ్యంకానుంది. ధర రూ. 42,400 నుంచి ప్రారంభం కానుందని అంచనా. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ ద్వారా తక్షణం రూ.2500 క్యాష్ బ్యాక్ సదుపాయం. డెబిట్ కార్డ్ ద్వారా రూ. 2 వేల డిస్కౌంట్ సదుపాయాన్ని వినియోగదారలకు లభ్యం కానుంది. ఇప్పటికే ఈ స్మార్ట్ఫోన్ను చైనాలో మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఎంఐ 10 స్మార్ట్ఫోన్ ప్రత్యేకతలు
6.67 అంగుళాల డిస్ప్లే
క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 సాక్ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 10
1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్
8జీబీ ర్యామ్, 128 స్టోరేజ్
20 ఎంపీ సెల్పీ కెమెరా
108+13+ 2+2 ఎంపీ క్వాడ్ రియర్ కెమరా
4780 బ్యాటరీ సామర్థ్యం
Mi Fans, wait is over! 🥳#𝐌𝐢𝟏𝟎 𝐢𝐬 𝐥𝐚𝐮𝐧𝐜𝐡𝐢𝐧𝐠 𝐨𝐧 𝟑𝟏𝐬𝐭 𝐌𝐀𝐑𝐂𝐇 𝐚𝐭 𝟏𝟐:𝟑𝟎 𝐏𝐌.
Watch Livestream across @XiaomiIndia social media handles. Know more here: 👉 https://t.co/oKPXrAaCYf
RT with #Mi10IsHere and #108MP if you are excited. 🔄#Xiaomi ❤️️ pic.twitter.com/P4KkLWFH95
— Manu Kumar Jain (@manukumarjain) March 19, 2020