108 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది..

19 Mar, 2020 16:10 IST|Sakshi

మార్చి 31న షావోమి ఎంఐ 10 స్మార్ట్‌ఫోన్‌

108 ఎంపీ భారీ కెమెరా

న్యూఢిల్లీ: షావోమి కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేయనుంది. ఇండియాలో తన మొట్టమొదటి 5 జీ ఎంఐ 10 స్మార్ట్‌ ఫోన్‌ను మార్చి 31న మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు షావోమి ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ ప్రకటించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు కస్టమర్లు ప్రీ ఆర్డర్లు చేసుకోవచ్చని  కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌ అమెజాన్‌ ఆన్‌లైన్‌లో సేల్‌  ప్రారంభం.

12 జీబీ ర్యామ్‌, 512 స్టోరేజ్‌, 8 జీబీ ర్యామ్‌, 256 స్టోరేజ్‌  ఆప్షన్లతో రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ ఫోన్‌ లభ్యంకానుంది. ధర రూ. 42,400 నుంచి ప్రారంభం కానుందని అంచనా. యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ ద్వారా తక్షణం రూ.2500 క్యాష్‌ బ్యాక్‌ సదుపాయం. డెబిట్‌ కార్డ్‌ ద్వారా రూ. 2 వేల  డిస్కౌంట్‌ సదుపాయాన్ని వినియోగదారలకు లభ్యం కానుంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌ను  చైనాలో మార్కెట్‌లో  విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఎంఐ 10 స్మార్ట్‌ఫోన్‌​ ప్రత్యేకతలు
6.67 అంగుళాల డిస్‌ప్లే 
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 సాక్‌ప్రాసెసర్
ఆండ్రాయిడ్‌ 10
1080x2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
8జీబీ  ర్యామ్‌, 128 స్టోరేజ్‌
20  ఎంపీ సెల్పీ కెమెరా
108+13+ 2+2 ఎంపీ  క్వాడ్‌  రియర్‌ కెమరా
4780  బ్యాటరీ సామర్థ్యం

మరిన్ని వార్తలు