షావోమి నుంచి ‘ఎంఐ 5’

1 Apr, 2016 02:14 IST|Sakshi
షావోమి నుంచి ‘ఎంఐ 5’

న్యూఢిల్లీ: చైనా మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ షావోమి తాజాగా ‘ఎంఐ 5’ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.24,999. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.15 అంగుళాల స్క్రీన్ (1080ఁ1920 పిక్సల్స్), క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ, 16 ఎంపీ రియర్ కెమెరా, 4 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ, ఎన్‌ఎఫ్‌సీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ తెలిపింది. నలుపు, బంగారం, తెలుపు రంగుల్లో లభించనున్న ఈ స్మార్ట్‌పోన్స్ ఏప్రిల్ 6 నుంచి ఎంఐ.కామ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

మరిన్ని వార్తలు