రూ.3,000 వరకూ  తగ్గిన ఎమ్‌ఐ ఏ2 ధరలు 

8 Jan, 2019 01:38 IST|Sakshi

ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజ కంపెనీ షావోమి తన ఎమ్‌ఐ ఏ2 స్మార్ట్‌ఫోన్ల ధరలను రూ.3,000 వరకూ తగ్గించింది. భారత్‌లో అమ్మకాలు ఆరంభించి ఐదేళ్లవుతోందని పేర్కొన్న కంపెనీ... ఈ సందర్భంగా ఎమ్‌ఐ ఏ2 స్మార్ట్‌ఫోన్ల ధరలను తగ్గించింది.

4 జీబీర్యామ్‌/64 జీబీ ఇంటర్నల్‌ మెమెరీ ఉన్న మోడల్‌ ధర రూ.2,000 తగ్గి రూ.13,999కు చేరిందని షావోమి తెలిపింది. అలాగే 6 జీబీ ర్యామ్‌/128 జీబీ ఇంటర్నల్‌ మెమెరీ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.3,000 తగ్గి రూ.15,999కు చేరిందని పేర్కొంది. 

మరిన్ని వార్తలు