షావోమి ఫెస్టివ్‌ సేల్‌: రూ.9వేల దాకా డిస్కౌంట్‌

1 Apr, 2019 16:07 IST|Sakshi

ఎంఐ ఫాన్స్‌ ఫెస్టివ్‌ సేల్‌ను  మళ్లీ  ప్రకటించిన షావోమి

స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌టీవీలపై భారీ ఆఫర్లు 

ఏప్రిల్‌ 4 -6వ తేదీ వరకు  సేల్‌

సాక్షి, ముంబై:  చైనా మొబైల్‌ మేకర్‌ షావోమి మరోసారి ఎంఐ ఫాన్స్‌ ఫెస్టివల్‌ సేల్‌ను మళ్లీ ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన వినియోగదారులకు తాజా సేల్‌ద్వారా భారీ ఆఫర్లను అందిస్తోంది ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ ఫెస్టివ్‌  సేల్‌ కొనసాగుతుంది. ఆన్‌లైన్‌లో ఎంఐ.కాం,  ఆఫ్‌లైన్‌ లో ఎంఐ హోం, ఎంఐ స్టోర‍్లలో ఈ సేల్‌ ఉంటుంది. షావోమి లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్లపై రూ. 9వేల దాకా తగ్గింపును ఆఫర్‌ చేస్తోంది.

దీంతోపాటు స్మార్ట్‌ టీవీలను కూడా తగ్గింపు ధరలతో అందుబాటులోకి తెచ్చింది. దీంతోపాటు హెడ్‌ఎఫ్‌సీ కార్డు ద్వారా కొనుగోళ్లపై 5శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ అందిస్తోంది. షావోమి రెడ్‌మి 6, రెడ్‌మి వై2, రెడ్‌మి నోట్‌ 5ప్రొ, పో​కో ఎఫ్‌1 ఎంఐ ఎల్‌ఈడీ టీవీ4 ప్రొలపై భారీ డిస్కౌంట్‌ను అందివ్వనుంది.

>
మరిన్ని వార్తలు