బడ్జెట్‌ ధరలో షావోమి ఎంఐ స్మార్ట్‌టీవీ

28 Feb, 2019 16:40 IST|Sakshi

32 అంగుళాల ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌టీవీ ధర రూ.12999

మార్చి 7వ తేదీ  నుంచి  విక్రయానికి లభ్యం

సాక్షి, న్యూఢిల్లీ : చైనా దిగ్గజ కంపెనీ షావోమి నోట్‌ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లతో పాటు మరో స్మార్ట్‌టీవీని కూడా లాంచ్‌ చేసింది. ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆధారిత  32 అంగుళాల స్మార్ట్‌ టీవీని గురువారం ఆవిష్కరించింది. ఎంఐ ఎల్‌ఈడీ 4ఏ ప్రో పేరుతో దీన్ని తీసుకొచ్చింది. దీని ధరను  రూ.12,999గా నిర్ణయించింది.  మార్చి 7వ తేదీనినుంచి మై హోం, ఎంఐ.కాం, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులో ఉంటుందని షావోమి వెల్లడించింది. 

ఎంఐ ఎల్‌ఈడీ 4ఏ ప్రో ఫీచర్లు

32 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే 
1366 x 768  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
1జీబీ ర్యామ్‌, 8ఈ ఎంఎంసీ స్టోరేజ్‌
లేటెస్ట్‌ అమ్లోజిక్‌ 64బిట్‌ ప్రాసెసర్‌ విత్‌  7వ జనరేషన్‌ ఇమేజింగ్‌ ఇంజీన్‌
గూగుల్‌ అసిస్టెంట్‌, బ్లూ టూత్‌, ఎంఐ రిమోట్‌

మరిన్ని వార్తలు