షావోమీ టీవీ ధరలు తగ్గాయ్‌!

1 Jan, 2019 14:58 IST|Sakshi

సాక్షి, ముంబై:  స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో భారత్‌లో టాప్‌ నిలిచిన  చైనా కంపెనీ టీవీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎంఐ  స్మార్ట్‌టీవీల పేరుతోబడ్జెట్‌ ధరల్లో వీటిని  కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చి  స్మార్ట్‌టీవీల్లో కూడా నెం.1 బ్రాండ్‌గా నిలిచింది.  తాజాగా  షావోమి తన కస‍్టమర్లకు నూతన సంవత్సర కానుకను అందించింది.  ఎంఐ టీవీలపై ధరలను తగ్గించినట్టు ప్రకటించింది. ఎంఐ టీవీల ధరలను తగ్గించినట్టు  షావోమి వెల్లడింది. వెయ్యి నుంచి 2వేల రూపాయల దాకా ఈ తగ్గింపు  ఉండనుంది.  

32 అంగుళాల ఎంఐ టీవీ 4ఏ ధర రూ.1500 తగ్గింపుతో ప్రస్తుతం రూ.12,499లకు అందుబాటులో ఉంది.
32 అంగుళాల  ఎంఐ టీవీ 4సీ ప్రొ  ధర. రూ.13,999గా ఉంది.  రూ.2 వేలను తగ్గించింది. 
49 అంగుళాల ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4ఏ ప్రొ రూ.1000తగ్గి  రూ. 30,999లకే అందుబాటులో ఉంది. 

మరిన్ని వార్తలు