ముంబై: డెబిట్/క్రెడిట్ కార్డు లావాదేవీలు మరింత సురక్షితంగా జరిగేలా చూసేందుకు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ నుంచి ఈఎంవీ చిప్, పిన్ ఆధారిత డెబిట్/క్రెడిట్ కార్డులు మాత్రమే జారీ చేయాలని బ్యాంకులను ఆదేశించింది. ఇప్పటికే కొన్ని బ్యాంకులు వీటిని జారీ చేస్తున్నప్పటికీ ఇంకా చాలామటుకు బ్యాంకులు మ్యాగ్నెటిక్ స్ట్రైప్ కార్డులే ఇస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ తాజా ఆదేశాలు ఇచ్చింది.