తిరుమలలో పెరిగిన రద్దీ

21 Dec, 2017 19:20 IST|Sakshi

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ గురువారం పెరిగింది. శ్రీవారి దర్శనానికి 20 కంపార్టమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 7 గంటలు, కాలిబాట దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.10 కోట్లు. ఈ నెల 29, 30 న వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రానుండటంతో తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదనంగా ఆరు కిలోమీటర్ల క్యూలైన్ ఏర్పాటు చేశారు. ఏకాదశి నాడు ఉదయం 5:30 గంటలకు వీఐపీ దర్శనం, 8 గంటలకు సర్వదర్శనం ప్రారంభమౌతుంది. ఏకాదశి శుక్రవారం రానుండటంతో నాలుగు గంటలు ఆలస్యంగా దర్శనం ప్రారంభమౌతుంది.
 

మరిన్ని వార్తలు