తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

7 Jan, 2018 08:58 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం భక్తులు 12 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.

సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. కాలినడక భక్తులకు 2 గంటలు, స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. శనివారం స్వామి వారిని 67,135 మంది దర్శించుకున్నారు. 27,172 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ రాబడి రూ. 2.08 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు