64వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

16 Jan, 2018 19:47 IST|Sakshi

సాక్షి, తిరుపతి : వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 64వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని వేదమాలపేట మండలం పాడిరేడులో ఉదయం ఎనిమిదిన్నర గంటలకు బుధవారం వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభించనున్నారు.

పాడిరేడు నుంచి తాత్నేరి గిరిజన కాలనీ, లక్ష్మమ్మ కండ్రిగ, టీసీ అగ్రహారం మీదుగా కొనసాగి 11 గంటలకు శ్రీకాళహస్తి నియోజకవర్గం యేర్పేడు మండలంలోని ఆర్‌వీ కండ్రిగ చేరుకుంటారు. పెనుమల్లాం, పాపనాయుడు పేట, మర్రిమంద బీసీ కాలనీ మీదుగా వికృతమల వరకు యాత్ర కొనసాగుతోంది. సాయంత్ర అక్కడే బుధవారం యాత్ర ముగించి వైఎస్ జగన్ రాత్రికి బస చేస్తారు.

మరిన్ని వార్తలు