ప్రజాసంకల్పయాత్ర 50వ రోజు షెడ్యూల్‌..

1 Jan, 2018 19:22 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : ప్రజాసంకల్పయాత్ర 50వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి...మంగళవారం ఉదయం తన యాత్రను సీటీఎం నుంచి ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి పులవాండ్లపల్లి, కసిరావుపేట, వాల్మీకి పురం, ఐటీఐ కాలనీ, పునుగుపల్లి, విటలాం, టీఎం లోయ, జమ్మిలవారిపల్లి మీదగా పాదయాత్ర కొనసాగుతుంది.

49వ రోజు ముగిసిన ప్రజాసంకల్పయాత్ర
49వ రోజు ప్రజాసంక్పలయాత్రను వైఎస్‌ జగన్‌  చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర రేగంటివారిపల్లి మీదగా సీటీఎం వరకూ కొనసాగింది. ఇవాళ 14.5 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేశారు. ముదివేడు, కడప క్రాస్‌, నడింపల్లి, ఆర్‌సీ కురవపల్లి, గడ్డెత్తుపల్లి, నల్లగుట్టపల్లి, కాయలపల్లి, అడ్డగింటవారిపల్లి, చిలకవారిపల్లి, రేగంటివారిపల్లి మీదగా సీటీఎం వరకూ పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా తనను కలిసినవారి సమస్యలు తెలుసుకుంటూ... వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇస్తు ముందుకు కదిలారు.  చిన్నతిప్ప సముద్రంలో ప్రజలతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖి నిర్వహించారు.

మరిన్ని వార్తలు