ఆస్ట్రేలియాలో జరిగితే ఆ టికెట్లు చెల్లుతాయి: ఐసీసీ

21 Jul, 2020 16:04 IST|Sakshi

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్–2020​ టోర్నమెంటు 2021లో ఆస్ట్రేలియాలో జరిగితే ఇప్పటికే కొనుక్కున్న టికెట్లతో ఫ్యాన్స్​ మ్యాచులు వీక్షించొచ్చని ఐసీసీ ప్రకటించింది. ఒకవేళ ఆస్ట్రేలియా 2022 టీ20 ప్రపంచకప్​కు ఆతిథ్యం ఇస్తే, ఈ టికెట్ల డబ్బు వాపసు వస్తుందని పేర్కొంది. (విదేశాల్లో ఆడుకుంటాం.. అనుమతివ్వండి)

కోవిడ్​–19 వల్ల ఈ ఏడాది అక్టోబర్​, నవంబర్​ నెలల్లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన పొట్టి ప్రపంచకప్​ను వచ్చే ఏడాదికి ఐసీసీ సోమవారం వాయిదా వేసింది. 2021, 2022ల్లో వరుసగా రెండు టీ20 ప్రపంచకప్​లను నిర్వహిస్తామని తెలిపింది. (2021లో 20–20 ప్రపంచకప్‌)

2021 టీ20 ప్రపంచకప్​ను భారత్​ ఆతిథ్యం ఇవ్వాలి. కానీ దీనిపై ఐసీసీ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.

మరిన్ని వార్తలు