శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 11కిలోల బంగారం పట్టివేత

28 May, 2019 20:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేపట్టిన డీఆర్‌ఐ అధికారులు దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి వద్ద  పెద్ద మొత్తంలో బంగారాన్ని గుర్తించారు. ఆ మహిళ నుంచి 11.1 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ 3.6 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న 7 క్లాత్‌ ప్యాకెట్స్‌తో పాటు, సాక్స్‌లలో ఆమె బంగారం తీసుకోచ్చినట్టు అధికారులు వివరించారు. అంతేకాకుండా గత మూడు నెలలుగా ఆ మహిళ నివాసం ఉంటున్న ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ రూమ్‌లో సైతం తనిఖీలు చేపట్టిన అధికారులు స్మగుల్డ్‌ గూడ్స్‌తో పాటు భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ మహిళను అరెస్ట్‌ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.


మరిన్ని వార్తలు