తాలిబన్‌ దాడి..12 మంది మృతి

12 Apr, 2018 12:01 IST|Sakshi
ఘటన జరిగిన ప్రాంతం

కాబూల్‌ : తాలిబన్‌ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ జిల్లా గవర్నర్‌తో పాటు మరో 11 మంది చనిపోయారు. ఈ ఘటన ఆప్ఘనిస్తాన్‌లోని గజిని ప్రావిన్స్‌లో గురువారం వేకువజామున 3 గంటల సమయంలో జరిగింది. ఖవాజా ఒమరి జిల్లాలోని చెక్‌పోస్టుపై తాలిబన్‌ ఉగ్రవాదులు మెరుపుదాడి చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. సుమారు 4 గంటల పాటు కాల్పులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ తాలిబన్‌ ఉగ్రవాదులు ప్రకటన జారీ చేశారు. అలాగే జిల్లా హెడ్‌క్వార్టర్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు