-

అమ్మా.. సారీ!

27 Sep, 2019 01:36 IST|Sakshi

12 ఏళ్ల చిన్నారి కన్నీటి వ్యథ

రెండేళ్లుగా 30 మంది అత్యాచారం

కేరళలో వెలుగుచూసిన దారుణం

మళప్పురం: 12 ఏళ్ల బాలికపై రెండేళ్లుగా దాదాపు 30 మంది అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన కేరళలోని కొజిక్కోడ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పాఠశాలలో జరిగిన ఒక కౌన్సెలింగ్‌ ద్వారా ఈ దారుణం వెలుగులోకి వచి్చంది. దీనిపై ఆ బాలిక తండ్రి, మరో ఇద్దరిని ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేసి, కేసు నమోదు చేశారు. ఆ బాలికను దగ్గర్లోని షెల్టర్‌ హోంలో చేరి్పంచారు. జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలిక..సూ్కల్‌లో ముభావంగా ఉండటంతో కౌన్సెలర్‌ ఆ బాలిక ఇంటి పరిస్థితులపై ప్రశి్నంచారు. దాంతో కన్నీటిపర్యంతమైన బాలిక ఆ దారుణాన్ని వెల్లడించింది. రెండేళ్ల క్రితం (అప్పుడు ఆ బాలికకు పదేళ్లు) తన తండ్రి ఓ స్నేహితుడి వద్ద కొంత డబ్బు అప్పు తీసుకున్నాడని, అది తీర్చలేని పరిస్థితుల్లో ఆ స్నేహితుడికి తనను అప్పగించాడని తెలిపింది.

ఆ తరువాత ఆ స్నేహితుడు మరి కొందరిని తీసుకువచ్చాడని, అలా రెండేళ్లుగా ఈ దారుణం కొనసాగుతోందని వెల్లడించింది. ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి, నానమ్మ అనారోగ్యం.. తదితర ఆరి్థక ఇబ్బందుల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తన తండ్రిని అరెస్ట్‌ చేస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని ఆ బాలిక వేడుకోవడం, ‘అమ్మా సారీ’అంటూ వారున్న ఇంటి తలుపుపై ఆ చిన్నారి రాయడం అక్కడివారికి కన్నీళ్లు తెప్పించింది. ఆ పాపకు పాఠశాలలో స్నేహితులెవరూ లేరని, ఎవరితో అంత కలుపుగోలుగా ఉండకపోయేదని, ఎప్పుడు ముభావంగా, నీరసంగా ఉండేదని క్లాస్‌మేట్స్‌ తెలిపారు.


అయినా, ఆ బాలికను ఆమె తల్లే పాఠశాలకు తీసుకువచి్చ, తీసుకువెళ్లేదని, ఎవరితో మాట్లాడనిచ్చేది కాదని వివరించారు. దాదాపు ప్రతీరోజు రాత్రంతా ఆ బాలిక అరుపులు, ఏడుపులు వినిపించేవని, అయితే, అది వారి ఇంటి విషయమని, అందులో కలగజేసుకోకూడదనే ఉద్దేశంతో తాము పట్టించుకోలేదని ఆ బాలిక ఇంటి దగ్గర్లోని వారు చెప్పారు. మొదట్లో చురుగ్గా, ఆరోగ్యంగా ఉండే పాప.. నిస్తేజంగా, స్తబ్దుగా మారిపోవడంతో వారి ఇంటి దగ్గర్లోని వారే పాఠశాలలో సమాచారమివ్వడంతో ఆ బాలికకు కౌన్సెలింగ్‌ నిర్వహించినట్లు సమాచారం. ఆ బాలిక తల్లి మాత్రం ఇదంతా అబద్ధమని, కుట్ర అని చెబుతోంది.   

మరిన్ని వార్తలు