యువతిపై బాలుడి అత్యాచారం.. !

31 Oct, 2019 13:05 IST|Sakshi

15 ఏళ్ల బాలుడిని అరెస్టు చేసిన పోలీసులు

చండీగఢ్‌: పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం జరిపాడని 21 ఏళ్ల యువతి 15 ఏళ్ల బాలుడిపై రేప్‌ కేసు నమోదు చేసింది. ఈ ఘటన చండీగఢ్‌లో జరిగింది. సెక్షన్‌ 164 ప్రకారం బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు.. నిందితుడైన మైనర్‌ను జువెనైల్‌ హోమ్‌కు తరలించారు.

నిందితుడు తనను ముంబైకి తీసుకెళ్లి ఒక హోటల్‌లో ఉంచి తనపై అత్యాచారం జరిపినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే నిందితుడి కుటుంబసభ్యులు మాత్రం ఈ ఆరోపణలు కొట్టిపారేస్తున్నారు. సదరు యువతి, బాలుడితో కలిసి ఇంటినుంచి పారిపోయి.. ముంబై వెళ్లిపోయారని, ఇరు కుటుంబసభ్యులు వారిని ఒప్పించి తిరిగి ఇంటికి తీసుకొచ్చారని వారు అంటున్నారు. యువతి, బాలుడి ఒకరికొకరు తెలుసునని, నెలన్నర కింద వారు ఇంటినుంచి పారిపోయి ముంబైలో గడిపారని, అక్కడి నుంచి తీసుకొచ్చాక, బాలిక తల్లి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసిందని మైనర్‌ బంధువులు అంటున్నారు. ఈ కేసుపై పోలీసులు స్పందిస్తూ.. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదట ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. కేసును విచారిస్తున్నామని, అసలు ఏం జరిగిందన్నది తెలుసుకొని.. దాని ఆధారంగా నిందితుడైన మైనర్‌ను జువెనైల్‌ జస్టిస్‌ బోర్డుముందు ప్రవేశపెడతామని చెప్తున్నారు.

మరిన్ని వార్తలు