తల్లిని బంధించి యువతిపై అత్యాచారం

15 Apr, 2019 12:02 IST|Sakshi

ముజఫర్‌నగర్‌ : ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లి ముందే కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధ యువకులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్‌నగర్‌ జిల్లా కాక్రౌలి ప్రాంతానికి చెందిన ఓ 22 ఏళ్ల యువతి మెడిసిన్‌ కొనేందుకు తల్లితో కలిసి బయటకు వచ్చింది. మెడికల్‌ షాపుకెళ్లి మందులు కొనే సమయంలో ఇద్దరు యువకులు వచ్చి వారిని బెదిరించి దగ్గర్లో ఉన్న చెరకు తోటకు తీసుకెళ్లారు. అనంతరం తల్లిని బంధించి కూతురిపై సామూహిక అత్యాచారానికి పాల్పలడ్డారు. ఈ విషయం బయట చెప్పొద్దని తల్లికూతుళ్లను బెదిరించి పారిపోయారు. ఇంటికి వచ్చిన యువతి జరిగిన విషయాన్ని తండ్రికి వివరించారు. దీంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు