దీపావళి వేడుకల్లో 25 మందికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. వెలుగులు వెదజల్లాలని చేసుకునే పండుగ రోజున వారి జీవితాల్లో చీకటి కమ్ముకుంది. నగరం మొత్తం మీద పండుగ వేడుకల్లో టపాసులు కాలుస్తూ సుమారు 25మందికి పైగా గాయపడ్డారు. ఇందులో ముగ్గురికి తీవ్రగాయాలవ్వగా మరి కొందరికి స్వల్పగాయాలయ్యాయి. బాధితుల్లో ఆరుగురు చిన్నారులు కూడ ఉన్నారు.
ఇందులో ముగ్గురి పరిస్థతి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వారిని సరోజిని కంటి ఆస్పత్రికి తరలించారు. గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న స్వప్న అనే విద్యార్థి కంటికి తీవ్రగాయాలయ్యాయి. చరణ్ అనే మరో విద్యార్థికూడా గాయపడ్డాడు. వీరితోపాటు మరో ఇద్దరు బాలురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. క్రాకర్స్ కాల్చే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభంవించిందని వైద్యులు తెలిపారు. బాధితుల్లో ముగ్గురి పరిస్థతి విషమంగా ఉందని వారికి తగిన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు.