విశాఖలో ముగ్గురు యువతుల అదృశ్యం కలకలం!

18 Feb, 2020 17:11 IST|Sakshi
అదృశ్యమైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు (ఫైల్‌ ఫోటో)

సాక్షి, విశాఖపట్నం: ‘మేం ముగ్గురం చనిపోతున్నాం.. మాకోసం వెతకొద్దు’ అని తల్లికి మేసేజ్‌ పెట్టి ముగ్గురు అక్కాచెల్లెళ్లు అదృశ్యమైన ఘటన వైజాగ్‌లో స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ముగ్గురు యువతులు సోమవారం రాత్రి ఇంట్లో చెప్పి బయటకు వెళ్లారు. ఆ తర్వాత ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు ద్వారకనగర్‌ పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్న క్రమంలో యువతులు తాము చెన్నైలో క్షేమంగా ఉన్నట్లు తల్లికి మేసేజ్‌ పెట్టారు. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు తెలిపి తన బిడ్డలను క్షేమంగా తీసుకురావాలని పోలీసులను వేడుకుంది.

ఇక ముగ్గురు యువతులు ఇల్లు వదిలి వెళ్లడానికి గల కారణాలేంటి, చెన్నైకి ఎందుకు వెళ్లారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  కాగా అదృశ్యమై ఈ ముగ్గురు యువతులు మింది అనురాధ, మింది తులసి, మింది కోమలిలు సొంత అక్కాచెల్లెళ్లు. వీరు ద్వారకనగర్‌లో సాయినంద అపార్టుమెంటులో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఎర్రం నాయుడు కుమార్తెలు. సోమవారం రాత్రి అదృశ్యమైన వీరి కోసం మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు