హైదరాబాద్: తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అమర్రాజ్ అనే పాత నేరస్తుడిని, కుమార్ రెడ్డి, కరమోత్ సంతోష్ అనే ఇద్దరు నిందితులను మీర్పేట్ పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి 28 తులాల బంగారు ఆభరణాలు,13 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే మూడు బైక్లు, ఒక ఐపోడ్, రెండు మొబైల్ ఫోన్లు, రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు.