ఫరిదాబాద్ : హరియాణలో దారుణం చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారం చేసి అనంతరం కిరాతకంగా హత్య చేసి చెత్తకుప్పలో విసిరేసాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ హృదయ విచారక ఘటన గత గురువారం ఫరిదాబాద్ సమీపంలో అసోథి గ్రామంలో చోటుచేసుకుంది. చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు ధృవికరించారు. ఆ చిన్నారి తండ్రి స్వీట్ షాప్లో పనిచేసే యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వీట్ షాప్లో పనిచేసే బోలా అలియాస్ విరేంధర్ (24), ఆ చిన్నారిని ఇంటి వద్ద డ్రాప్ చేస్తానని మధ్యాహ్నం తీసుకెళ్లాడు. అప్పటి నుంచి సాయంత్రం వరకు కనిపించలేదు. గ్రామస్తులు బోలా ఇంటికేళ్లగా.. అతను అక్కడ కనిపించాడు. అయితే ఆ చిన్నారి మాత్రం ఆ ఇంటి సమీపంలోని చెత్త కుప్పలో విగత జీవిగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చిన వారు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడికి పెళ్లైందని, కానీ భార్య తనతో ఉండటంలేదని పోలీసులు పేర్కొన్నారు.