మహిళపై దాడి.. పోలీసులపై చర్యలు

28 May, 2019 16:42 IST|Sakshi

చండీగఢ్‌ : మహిళను బెల్ట్‌తో విచక్షణారహితంగా కొట్టినందుకు గాను ఐదుగురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. వివరాలు.. ఫరిదాబాద్‌కు చెందిన ఓ ఐదుగురు పోలీసు అధికారులు.. ఓ మహిళపై దాడి చేశారు. బెల్ట్‌తో విచక్షణారహితంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అధికారులు దీనిపై స్పందించారు. వీడియోలో ఉన్న అధికారులపై కేసు నమోదు చేయడమే కాక వారిని విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు హెడ్‌ కానిస్టేబుల్స్‌ని సస్పెండ్‌ చేయగా.. మరో ముగ్గురు స్పెషల్‌ ఆఫీసర్లను విధుల నుంచి తొలగించారు.

అంతేకాక సదరు అధికారుల మీద ఆదర్శ నగర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ వీడియో సంవత్సరం క్రితం నాటిదని అధికారులు తెలిపారు. బాధితురాలితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు