ఆరుగురు అరెస్ట్‌: రూ.11.13 లక్షల సొత్తు స్వాధీనం

30 Jan, 2018 14:25 IST|Sakshi

సాక్షి, కొవ్వూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సబ్ డివిజన్ పరిధిలో ద్విచక్ర వాహనాలు, బంగారు ఆభరణాల దొంగతనాలకు పాల్పడిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.11,13,600లు విలువ చేసే బంగారపు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 28 వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రవిప్రకాష్ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు