దేశ రాజధానిలో దారుణం

29 Dec, 2017 09:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. 60 ఏళ్ల వృద్ధుడు ఇద్దరు మైనర్‌ బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని పాలం ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుడు తన ఇంటిపక్కనే ఆడుకుంటున్న ఐదు, తొమ్మిది సంవత్సరాలున్న ఇద్దరు చిన్నారులను స్వీట్లు ఇస్తానని ఇంట్లోకి పిలిచి వారిపై అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు.

ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ వారికి 5 రూపాయలు ఇచ్చాడని ఢిల్లీ డీసీపీ మిలింద్‌ మహదేవ్‌ తెలిపారు. బాలికలు రోదిస్తూ జరిగిన దారుణాన్ని తల్లితండ్రులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి బాలికలకు కౌన్సెలింగ్‌ ఇచ్చినట్టు డీసీపీ చెప్పారు.

మరిన్ని వార్తలు