సాక్షి, మహబూబ్ నగర్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో 15 మంది మృత్యువాత పడ్డారు. సంఘటనా స్థలంలో 9 మంది మృతి చెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఆరుగురు మరణించారు. మిడ్జిల్ మండలం కొత్తపేట వద్ద ఆదివారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతులను భోగ్య తాండ వాసులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు.
మృతులు : బి.వెంకటమ్మ(45), చాంది(35), సాలమ్మ(50), రాగుల శివలీల( 40) బిచానీ(40), వడ్డే చెన్నమ్మ(50), సేవ్యా(30), శివాజీ నాయక్(40), కటికే బాలమని(45), బండారి ఎల్లమ్మ(45)చంద్రమ్మ(45), హెచ్ వెంకటమ్మ(45)