టాటా ఏసీ బీభత్సం.. ఏడుగురికి గాయాలు

21 Nov, 2019 18:48 IST|Sakshi

సాక్షి, విజయవాడ : నగర శివారులో ఉన్న ఓ గ్రామంలో టాటా ఏసీ వాహనం బీభత్సం సృష్టించింది. దారిలో వెళ్తున్న మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి.. రోడ్డు పక్కన ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలు అవ్వగా.. ఇ‍ద్దరి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో క్షతగాత్రులను 108 వాహనంలో విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

మరిన్ని వార్తలు