రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; 9 మంది మృతి

11 Feb, 2020 12:48 IST|Sakshi

జైపూర్‌ : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భిల్వారా జిల్లాలోని బిగోడ్‌ ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయి. భిల్వారా నుంచి కోటా జిల్లాకు వెళ్తున్న పెళ్లి బృందం బస్సు మార్గ మాధ్యలో కారును ఢీ కొట్టడంతో ఈ ఘటన సంభవించింది. మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను బిల్వారాలోని మహాత్మాగాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ప్రమాద ఘటనపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ స్పందించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం గెహ్లాట్‌ ఆదేశిస్తూ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు