సాక్షి, వరంగల్ : లంచం తీసుకుంటూ వరంగల్ రూరల్ జిల్లా చిల్పూర్ దేవాదాయ శాఖ ఈవో ఏసీబీ అధికారులకు చిక్కాడు. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఈవో జయశంకర్ అధికారులకు పట్టుబడ్డాడు. గ్రాట్యుటీ చెక్ ఇచ్చేందుకు జయశంకర్ లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. దేవాదాయ శాఖ ఈవో కార్యాలయంతో పాటు ఆయన నివాసంలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం.