అసభ్య పోస్టులపై ఫిర్యాదు.. పట్టపగలే దారుణం!

13 Jun, 2018 08:16 IST|Sakshi
హత్య జరిగిన బస్సు ఇదే

పుణే : మహారాష్ట్రలోని పుణేలో దారుణం చోటుచేసుకుంది. సోదరి ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తూ ఆమె గురించి అసభ్యంగా పోస్టులు పెడుతున్నాడని ఫిర్యాదు చేసిన యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. పట్టపగలే బస్సులో కత్తితో దాడి చేసి హత్యకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఖేడ్‌ టెహ్‌సిల్‌లోని దవాడికి చెందిన ఓ యువతిని వారికి దూరపు బంధువు వేధింపులకు గురి చేస్తున్నాడు. గత కొంతకాలం నుంచి యువతి ఫొటోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తూ అసభ్య పదజాలం వాడుతున్నాడు. వ్యక్తిగత సమాచారంతో పాటు ఫొటోలు పోస్టు చేస్తున్నాడంటూ బాధితురాలి సోదరుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న నిందితుడు తనపై ఫిర్యాదు చేసిన యువకుడిని హతమార్చాలని ప్లాన్‌ చేశాడు.

మంగళవారం యువకుడి కంటే ముందుగానే నిందితుడు దవాడిలో బస్సు ఎక్కాడు. బస్సు వెళ్తుండగా ఒక్కసారిగా వెనకనుంచి యువకుడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. బస్సులోని వారు షాక్‌కు గురై ఒక్కసారిగా గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్‌ బస్‌ ఆపగా.. నిందితుడు పారిపోయాడు. బస్సులోని ప్రయాణికులు, మృతుడి కుటుంసభ్యులు చెప్పిన వివరాలతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై ఫిర్యాదు చేసినందుకే ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు.

మరిన్ని వార్తలు