ఏసీపీ బలవన్మరణం

29 Nov, 2018 20:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పోలీస్‌ ప్రధాన కార్యాలయం భవంతి ఏడో అంతస్తు నుంచి ఏసీపీ ర్యాంక్‌ అధికారి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లోని పోలీసులు హుటాహుటిన ఏసీపీ ప్రేమ్‌వల్లభ్‌ (55)ను సమీప ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. ఢిల్లీ పోలీస్‌ ట్రాఫిక్‌, క్రైమ్‌ విభాగంలో ఆయన పనిచేస్తున్నారు.

కాగా,అత్యున్నత సేవలు అందించినందుకు గాను ప్రేమ్‌వల్లభ్‌కు 2016లో పోలీస్‌ మెడల్‌ లభించడం గమనార్హం. గురువారం ఉదయం పదిగంటలకు తన కార్యాలయం కిటీకిలో నుంచి ఆయన కిందకు దూకినట్టు అధికారులు తెలిపారు. కాగా ప్రేమ్‌వల్లభ్‌ గత కొద్దిరోజులుగా గురు తేజ్‌ బహుదూర్‌ ఆస్పత్రిలో డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు