పశ్చిమగోదావరి , ద్వారకాతిరుమల : అనుమానాస్పదంగా సంచరిస్తూ.. పొంతనలేని సమాధానాలు చెబుతున్న ఓ బాలికను స్థానికులు, దేవస్థానం సిబ్బంది పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి.. గుర్తుతెలియని బాలిక మంగళవారం మండలంలోని వెంకటకృష్ణాపురంలో ఓ ఇంటికి వెళ్లి ద్వారకాతిరుమలకు దారి అడిగింది.
ఓ ట్రాక్టర్ డ్రైవర్ ఆమెను ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయానికి తీసుకువచ్చాడు. ఆలయంలో హోంగార్డుకు అప్పగించారు. తన పేరు మానుకొండ మేరి అని, తండ్రి దారం శ్రీను అని చెప్పుకొచ్చింది. మిగిలిన వివరాలు చెప్పకపోవడంతో బాలికను పోలీస్స్టేషన్లో అప్పగించారు.