మరో డ్రగ్‌ రాకెట్‌ ముఠా గుట్టు రట్టు

10 Dec, 2017 16:02 IST|Sakshi

హైదరాబాద్ : హైదరాబాద్: నగరంలో మరో డ్రగ్ రాకెట్ ముఠా గుట్టు రట్టయింది. మల్కాజిగిరిలో 56 గ్రాముల హెరాయిన్ , ఒక కేజీ 50 గ్రాముల ఓపిఎంను టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ లక్షల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి రాజస్థాన్‌కు చెందిన ధశరథ్ గాయారీ‌, రమేష్‌ గాయారీ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిద్దరూ రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు. నగరంలో డ్రగ్స్‌ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

>
మరిన్ని వార్తలు