డ్రైనేజీలోకి దూసుకుపోయిన బస్సు

17 Sep, 2018 10:22 IST|Sakshi
ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు

సాక్షి, నల్గొండ : అదుపు తప్పి ఓ ఆర్టీసీ బస్సు డ్రైనేజీలోకి దూసుకుపోయింది. ఈ సంఘటన నల్గొండ జిల్లాలోని చిట్యాల పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై హైదరాబాద్‌ నుంచి చిలకలూరి పేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏపీఎస్‌ ఆర్టీసీకి చెందిన ఏపీ29జెడ్‌3538 బస్సు చిట్యాల వద్ద అదుపు తప్పి పక్కనే డ్రైనేజీలోకి దూసుకుపోయింది. బస్సులో ప్రయాణికులెవరూ లేక పోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు