సిపాయి ప్రాణం తీసిన సైబర్‌ నేరం!

22 Nov, 2019 11:01 IST|Sakshi

‘సైబర్‌’ ఉచ్చులో సిపాయి 

మోసపోయి.. ఈ–మెయిల్‌ పెట్టి ఆత్మహత్య 

కుట్ర కోణం గుర్తింపు.. ఢిల్లీలో ఇద్దరి అరెస్ట్‌ 

సాక్షి, హైదరాబాద్‌: విలాస్‌ మధుకర్‌ ఆర్మీలో సిపాయి. కార్ఖానా పరిధిలో ఉండే ఈయనకు ఈ–కామర్స్‌ సైట్స్‌ సెర్చ్‌ చేయడం అలవాటు. ఈ క్రమంలో రూ.7,999 విలువైన కాండో ప్యాక్‌ను రూ.2,999కే ఆఫర్‌ చేస్తున్నట్టు ఓ వెబ్‌సైట్‌లో కనిపించడంతో వాట్సాప్‌ చాటింగ్‌ ద్వారా నిర్వాహకులను సంప్రదించాడు. ఆఫర్‌ పొందాలంటే కొంత మొత్తం చెల్లించాలని నిర్వాహకులు చెప్పడంతో అప్పులు చేసి మరీ మధుకర్‌ పలు విడతల్లో రూ.1.10 లక్షలు జమ చేశాడు. ఆ తరువాత సైట్‌ నిర్వాహకుల నుంచి స్పందన లేదు. ఆందోళనకు గురైన మధుకర్‌.. తన వస్తువులు, డబ్బు వెంటనే పంపకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ నిర్వాహకులకు ఈ–మెయిల్‌ పెట్టాడు. భార్య క్వార్టర్స్‌లో లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత ఏప్రిల్‌ 17న జరిగిన ఈ ఘటనపై బాధితుడి భార్య ఫిర్యాదు చేశారు. ఆర్మీ సిపాయి ఆత్మహత్యకు కారణమైన ఈ సైబర్‌ నేరాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇందులో కుట్ర, సైబర్‌ నేరం, మోసం ఉన్నాయని తేల్చారు. కారకులైన ఇద్దరిని ఢిల్లీలో అరెస్టు చేశారు. 

మరిన్ని వార్తలు