ఇద్దరు వీఆర్‌ఏలపై గొడ్డలితో దాడి: ఒకరి మృతి

12 Jan, 2018 14:15 IST|Sakshi

మరొకరి పరిస్థితి విషయం

భూపాలపల్లి జిల్లాలో దారుణం

భూ వివాదాలే కారణం

సాక్షి, భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని కాటారం శివారులో శుక్రవారం ఇద్దరు వీఆర్‌ఏలపై దాడి జరిగింది. కాటారం వద్ద నుంచి వెళ్తున్న రాములు, మరో వీఆర్‌ఏలపై నివాస్‌ అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. భూ వివాదాల కారణంతోనే దాడి జరిగిందని స్థానికులు అంటున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థిలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు