ఆర్థిక ఇబ్బందులతో బ్యూటీషియన్‌..

24 Jul, 2019 13:09 IST|Sakshi
సత్య శిరీష (35)

కేపీహెచ్‌బీకాలనీ: ఆర్థిక ఇబ్బందులతో ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.  సీఐ లక్ష్మీ నారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు గ్రామానికి చెందిన గోపాలకృష్ణ సత్య శిరీష దంపతులు నగరానికి వలస వచ్చి కేపీహెచ్‌బీకాలనీలో ఉంటున్నారు. గోపాలకృష్ణ ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తుండగా సత్య శిరీష (35) స్థానికంగా బ్యూటీ పార్లర్‌ నిర్వహించేది. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న శిరీష మనస్తాపానికిలోనై మంగళవారం సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు ఆమెను ఆసుత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్దారించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు