సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మీర్పేట్ పరిధిలోని నాదర్గుల్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక శ్రీనిలయ టౌన్షిప్ వద్ద ఆటోను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడింది. మాధవ్, నితిన్ అనే ఇద్దరు యువకులు మృతిచెందారు. హరీష్, తరుణ్ అనే మరో ఇద్దరు గాయపడ్డారు.