చెట్టును ఢీకొన్న బైక్‌..ఇద్దరి మృతి

29 Mar, 2018 07:01 IST|Sakshi
ప్రమాద స్థలంలో మృతదేహాలు

వరంగల్ రూరల్ జిల్లా: పర్వతగిరి మండలం గుంటూరుపల్లి వద్ద గురువారం వేకువజామున ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో రాయపర్తి మండలం సన్నూరు గ్రామానికి చెందిన కాయక సంపత్‌(29), పల్లె ప్రభాకర్‌(19) అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ద్విచక్రవాహనంపై వరంగల్ నుంచి స్వగ్రామము వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

మరిన్ని వార్తలు