బైక్‌, లారీ ఢీ..ఒకరి మృతి

16 Apr, 2018 12:37 IST|Sakshi
ప్రమాద స్థలంలో బాధితులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: టేకులపల్లి మండలం బోజ్జాయిగూడెం ఆరో మైలు తండా వద్ద ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని బూడిద లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకిస్ట్‌ అక్కడికక్కడే మృతిచెందగా..వెనక కూర్చున్న యువతికి తీవ్రగాయాలు అయ్యాయి. యువతి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు గమనించి ఇల్లెందు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు రోంపేడు గ్రామానికి చెందిన భూక్యా సురేష్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు