అమీర్‌పేటలో బాంబు కలకలం

17 Jul, 2019 13:00 IST|Sakshi

అమీర్‌పేట: అమీర్‌పేటలో బాంబ్‌ కలకలం సృష్టించింది. మైత్రీవనం సమీపంలోని మెట్రో పిల్లర్‌ వద్ద ఓ డబ్బా అనుమానాస్పదంగా కనిపించడంతో అందులో బాంబు ఉండవచ్చునేనే భయంతో స్థానికులు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌తో తనికీలు నిర్వహించారు. డబ్బాలో పెయింట్‌ ఉన్నట్లు  తేలండోత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

మరిన్ని వార్తలు