ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
నిందితుడిపై కేసు, చిన్నారిని జీజీహెచ్కి తరలింపు
పేరేచర్ల(మేడికొండూరు): గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సిరిపురం గ్రామంలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించిన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిరిపురం ఎస్టీ కాలనీకి చెందిన 8 ఏళ్లబాలిక ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లగా ఇంటి వద్ద ఆడుకుంటోంది.
ఆ సమయంలో స్థానిక బాలుడు చిన్నారిని ఇంటి లోపలకి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. అయితే భయపడి పారిపోయాడు. పనులకెళ్లిన తల్లి ఇంటికి తిరిగి రాగానే జరిగిన విషయాన్ని చిన్నారి చెప్పింది. విషయం కుల పంచాయితీలో పెట్టగా, అక్కడ న్యాయం జరగలేదని బాలిక తల్లి గురువారం మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనకు కారణమైన యువకుడిని స్టేషన్కు తీసుకువచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న గుంటూరు అర్బన్ సౌత్ డీఎస్పీ ఆర్వీఎస్ఎన్ మూర్తి మేడికొండూరు పోలీస్స్టే షన్ను సందర్శించి, చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్కి తరలించినట్టు తెలిపారు.