అమ్మాయితో తెగ మాట్లాడుతున్నాడని..

10 Feb, 2019 10:42 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. అమ్మాయితో స్నేహం.. స్నేహితుల మధ్య మనస్పర్థలకు దారితీసింది. చివరకు ఒకరు ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఈ దారుణ ఘటన గత శనివారం సెంట్రల్‌ ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత యువకుడు శుక్రవారం అర్థరాత్రి తన ఇంటీ సమీపంలో ఉండగా.. అతని స్నేహితులైన నలుగురు టీనేజర్స్‌ ఫోన్‌ చేసి ఓ విషయం మాట్లాడాలని పిలిపించారు. ఈ విషయం గురించి మాట్లాడుతుండగా బాధితుడితో మాట మాట పెరిగి వాగ్వాదానికి దారితీసింది. విచక్షణ కోల్పోయిన సదరు యువకులు అతనిపై  పలుమార్లు కత్తితో దాడి చేసి పారిపోయారు.

కత్తి గాట్లకు తీవ్రంగా గాయపడ్డ బాధితుడు సాయం కోసం అరుస్తుండగా.. అటుగా వచ్చిన అతని తల్లి ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. నలుగురిలో ఒకరి స్నేహితురాలైన ఓ అమ్మాయితో బాధితుడు చనువుగా.. ఉండటం, బెదిరించినా అలాగే మాట్లాడుతుండటంతో తట్టుకోలేని ఆ యువకులు బాధితుడిని మట్టుబెట్టారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన పలువురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు, ఒకరి కోసం గాలింపు చేపట్టామని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు