చిత్తూరు, గుడిపాల : కుటుంబ కలహాలతో ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం మండలంలోని 189.కొత్తపల్లెలో చోటుచేసుకుం ది.వివరాలు.. బండపల్లెకు చెందిన గోపి, భారతిల కుమార్తె సో ని (19)కి 189.కొత్తపల్లెకు చెందిన రాజేష్(20)తో మూడు నెలల క్రితం వివాహమైంది.
రాజేష్ బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ, అక్కడే ఉం టూ అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఇది ఇబ్బందిగా ఉండడంతో పదిరోజుల్లో భార్యను కూడా బెంగళూరుకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాడు. ఈ నేపథ్యంలో∙రాజేష్ తల్లిదండ్రుల వేధింపులతో సోని ఇంట్లోని ఫ్యాన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. ఎస్ఐ షేక్షావల్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.