పెళ్లింట విషాదం

10 May, 2019 19:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కామారెడ్డి జిల్లా: కామారెడ్డి పట్టణంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన మంగళి కిషోర్‌గా గుర్తించారు. మంగళి కిషోర్‌కు రెండు రోజుల క్రితమే వివాహం జరిగింది. ఈ ఘటనతో పెళ్లింట విషాదం అలుముకుంది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు