తమ్ముడు తిట్టాడని అక్క ఆత్మహత్య

29 May, 2018 12:36 IST|Sakshi

విశాఖపట్నం, ఎస్‌.రాయవరం :  తమ్ముడు తిట్టాడని మనస్థాపం చెంది ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.  స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పి.ధర్మవరం గ్రామంలో కసిరెడ్డి మంగ(35) అనే వివాహిత పుట్టింటికి వచ్చింది. ఈ సందర్భంగా కుటుంబ వ్యవహారాల విషయంలో తమ్ముడు బద్ది కాశీనాయుడుకు, మంగకు ఘర్షణ తలెత్తింది. దీంతో మనస్థాపం చెందిన మంగ ఇంటిలో ఫ్యానుకు చీర బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొన ఊపిరితో ఉన్న మంగను నక్కపల్లి 30 పడకల ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ఫిర్యాదు మేరకు ఎస్‌.రాయవరం ఎస్‌ఐ కుమార్‌స్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు