సాక్షి, నిజామాబాద్: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దుండగులు ఓ వ్యక్తి గొంతు కోసి హత్యచేశారు. ఈ ఘటన వర్ని మండలంలో బుధవారం జరిగింది. హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు.