ఉద్యోగం లేదని యువకుడి ఆత్మహత్య

12 Sep, 2018 17:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో మరో నిరుద్యోగి ఆత్మహత్య పాల్పడ్డారు. ఉద్యోగం దొరకడంలేదని విజయవాడకు చెందిన బీటెక్‌ విద్యార్థి దుర్గారావు బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఒంటిపై  పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న దుర్గారావుని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.  

బీటెక్‌ పూర్తి చేసిన దుర్గారావు ఉదోగ్యం కోసం అనేక ప్రయత్నాలు చేశాడు. చాలా రోజులుగా అనేక ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఎక్కడా ఉద్యోగం లభించలేదు. రెండు రోజుల క్రితం కూడా ఇంటర్వ్యూ వెళ్లాడు. అక్కడ నిరాశే మిగిలింది. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన దుర్గారావు ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 

ఉద్యోగం లేక గత నాలుగేళ్లలో చాలామంది యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ఆశపడ్డ యువకులకు నిరాశే మిగిలింది. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు లేకపోవడం, ప్రైవేట్‌ జాబ్స్‌ దొరకకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య రాష్ట్రంలో ఘననీయంగా పెరిపోయింది. ఉపాధి కల్పనలో ప్రభుత్వం విఫలం చెందడంతో చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.  
 

మరిన్ని వార్తలు