అయ్యప్ప దర్శనానికి వెళ్లి వస్తూ..

13 Dec, 2018 10:06 IST|Sakshi

సాక్షి, చెన్నై : దైవ దర్శనం చేసుకుని వస్తున్న వారు అనంత లోకాలకు చేరుకున్నారు. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారిని కబళించింది. వివరాలు.. తమిళనాడులోని దిండివనం వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శబరిమల నుంచి వస్తున్న బస్సును, లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్‌లో ముగ్గురు అయ్యప్ప భక్తులు మరణించగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరిని చిత్తూరు జిల్లా ఊత్తుకోట, నాగులాపురం, సత్యవేడు గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు