మద్యం తాగి బస్సు నడిపాడని..

16 May, 2019 16:50 IST|Sakshi

సాక్షి, కృష్ణా: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల వల్ల గత మూడేళ్లలో రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అనేక హెచ్చరికలు చేసినా ప్రమాదాలు మాత్రం జరుగుతునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మద్యం తాగి వాహనం నడిపిన బస్సు డ్రైవర్‌కు జైలు శిక్ష పడింది.

ఈ ఘటన కృష్ణాజిల్లా నందిగామలో విధులు నిర్వర్తిస్తున్న బస్సు డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్న మేక బుజ్జికి  జైలు శిక్షతో పాటు అతడి డ్రైవర్ లైసెన్స్ సైతం రద్దు చేయాలని నందిగామ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆకుల సత్యనారాయణ అదేశాలు జారీ చేశారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
తాగి వాహనం నడిపిన బస్సు డ్రైవర్‌కు జైలు శిక్ష

మరిన్ని వార్తలు