న్యూఢిల్లీ : ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై మణిపురి సమీపంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్న సంఘటనలో ఏడుగురు మృతి చెందగా, 34 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.